తూగో జిల్లా గోపాలపురం మండలంలో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. వర్షానికి చెరువులు, వాగులు పొంగిపొర్లడంతో కాజ్వేలపై వరద నీరు ప్రవహించింది. దీనితో రహదారులు మూసుకుపోయి వేలాది వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామాల మధ్య రవాణా నిలిచిపోయింది.