నల్లజర్ల బాలుడి ప్రతిభ: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

నల్లజర్ల మండలం ఘంటవారిగూడెం గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల బాలుడు మౌర్య అసాధారణ ప్రతిభతో ప్రపంచ రికార్డు సాధించాడు. కేవలం 58 సెకన్లలో భారతదేశ మ్యాప్‌లోని 24 రాష్ట్రాలను గుర్తించి చెప్పడం ద్వారా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బాలుడిని అభినందించి, ప్రభుత్వం తరఫున 5 సెంట్ల నివేశన స్థలం మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్