జగ్గంపేటలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి రెండవ విడత ప్రవేశాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ ఎల్.ఆర్.ఆర్. కృష్ణన్ సోమవారం మీడియాకు తెలిపారు. అభ్యర్థులు జూలై 20వ తేదీ సాయంత్రం 5:00 లోపు iti. ap. gov. in అనే వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఆ ప్రింట్ కాపీ ఒరిజినల్ సర్టిఫికెట్లతో 23వ తేదీన కౌన్సెలింగ్ కు హాజరుకావాలని ప్రిన్సిపల్ కోరారు.