జగ్గంపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. డిజిటల్ మహానాడు కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ సమావేశంలో, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, రహదారుల విస్తరణ, యువతకు ఉపాధి, విద్యా-వైద్య రంగాల అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.