సాక్షులను బెదిరించిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్పై కాకినాడ మొబైల్ కోర్టులో వాదనలు ముగిశాయి. తదుపరి విచారణను కోర్టు మే 6కు వాయిదా వేసింది. అనంతబాబును కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా, ఆ పిటిషన్ను మొబైల్ కోర్టులోనే దాఖలు చేయాలని న్యాయస్థానం సూచించింది. మరోవైపు, సాక్షుల బెదిరింపు కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అనంతబాబు మరో పిటిషన్ దాఖలు చేశారు.