కాకినాడ జిల్లా మహిళలకు భద్రతతో కూడిన వసతి సౌకర్యాలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'సఖి నివాస్' పథకం కింద పిఠాపురం, కాకినాడ నగరాల్లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏర్పాటు చేయనున్నాయి. తొలి దశలో రెండు హాస్టల్స్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రతి హాస్టల్లో 30 మంది మహిళలకు సురక్షిత వసతి, అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు.