పదో తరగతి ఫలితాలలో కాకినాడ జిల్లా 86.08 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 14వ స్థానానికి పరిమితమైంది. జిల్లాలో మొత్తం 13,932 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 11,738 మంది (84.26%) ఉత్తీర్ణులయ్యారు. బాలికల విషయానికొస్తే, 14,357 మందికి గానూ 12,609 మంది (87.84%) ఉత్తీర్ణత సాధించారు. గతంతో పోలిస్తే జిల్లా వెనకంజ వేయడం చర్చనీయాంశమైంది. బాలికలు బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు.