కాకినాడ జిల్లా గొల్లప్రోలు పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న డాక్టర్ సుబ్బారావును అధికారులు శుక్రవారం సస్పెండ్ చేశారు. కొవిడ్ సమయంలో ఓ మహిళను మోసగించినట్టు ఆరోపణల నేపథ్యంలో, ఆమె నుంచి నగదు, బంగారం తీసుకున్నట్టు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి, ఆయనను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. పైకట్టు అధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్టు డీఎంహెచ్ తెలిపారు.