రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబు శనివారం కాకినాడ కలెక్టర్ హరేంధిరప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లో జరిగిన ఈ ప్రత్యేక భేటీలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం, ఎంపీ సతీశ్ బాబు కలెక్టర్తో కలిసి నేరుగా తుని పర్యటనకు బయలుదేరి వెళ్లారు.