భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి

ఆత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న రాష్ట్రవ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం కావడంతో భక్తులు భారీగా పోటెత్తారు. ఈ నేపథ్యంలో స్వామివారి ఆలయంలో క్యూలైన్లన్నీ భక్తులతో భారీగా కిక్కిరిసిపోయాయి. ఆలయ అధికారులు వేకువజామునంచే భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పించారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్