మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన 'శక్తి యాప్' పై కొవ్వూరు టౌన్ పోలీసులు మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు యాప్ పనితీరును వివరించారు. ఆపద సమయంలో మహిళలు యాప్లోని SOS బటన్ను నొక్కితే, వెంటనే సమాచారం కంట్రోల్ రూమ్కు చేరుతుందని, తద్వారా నిమిషాల వ్యవధిలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారని వారు తెలిపారు.