దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో గురువారం మెగా పేరెంట్స్ డే కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొని, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందనీయులని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ రంగరాయ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ పి. వీర్రాజు, కూటమి నాయకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.