కొవ్వూరు టౌన్ పీఎంఎంఎంఎం హై స్కూల్లో గురువారం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2. 0 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా 44వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకేసారి పేరెంట్-టీచర్ మీటింగ్లు నిర్వహించాలన్న వినూత్న ఆలోచన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.