ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠాణేలంక గ్రామంలో సోమవారం పులిదిండి గౌరీదేవి (32) అనే మహిళ పాముకాటుకు గురై మృతిచెందింది. ఇంటి ఎదురుగా ఉన్న తోటలో కొబ్బరి ఆకులు తీస్తుండగా ఆమెను పాము కాటువేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.