పేదల కళ్లలో సీఎం సహాయనిధి వెలుగులు నింపుతోందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. నిడదవోలులో ఇప్పటివరకు రూ.1.84 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేసి పంపిణీ చేసినట్టు తెలిపారు. మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎంఆర్ఎఫ్, ఎంఎంసీలను అందజేశారు. ఆపదలో ఉన్నవారికి సీఎం నిధి ఓ సంజీవని అని ఆయన పేర్కొన్నారు.