పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడలోని వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కి చేరింది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు మరణించడంతో ఈ సంఖ్య పెరిగింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్