జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ బుధవారం జి. రాగంపేటలో పంట పొలాలు, ధాన్యపు రాశులను పరిశీలించి, సాగు పనులపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వరికోత యంత్రాలకు డీజిల్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని, ధాన్యం సేకరణను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు తహశీల్దార్ వెంకటలక్ష్మి, ఏఓ సంజయ్ కుమార్లకు సూచనలు జారీ చేశారు.