పెద్దాపురం ప్రాంతంలో గురువారం విజిలెన్స్, మైన్స్ శాఖ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. అక్రమంగా గ్రావెల్ రవాణా చేస్తున్న ఎనిమిది టిప్పర్ లారీలను అధికారులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుక, గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని అందిన సమాచారం మేరకు ఈ ఆకస్మిక దాడులు జరిగాయి. సీజ్ చేసిన లారీలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.