కాపవరం గ్రామం వద్ద బుధవారం దమ్ము చేస్తున్న సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ కాకర రాజు (26)కు ఫిట్స్ రావడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు అతన్ని సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.