గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం భర్తలు మృతి చెందిన మహిళల పట్ల జాలిగా వ్యవహరించలేదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. శుక్రవారం ఆయన పిఠాపురంలో మాట్లాడుతూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పెన్షన్లు మంజూరు చేసిందని, భర్త చనిపోయిన నెలలోనే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. వితంతువుల కష్టాలు తీరేలా కృషి చేస్తోందని చెప్పారు.