బిసివై పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్‌గా శీరం శ్రీను

భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్‌గా శీరం శ్రీనును నియమించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో ఆయనకున్న సంబంధాలు, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తించి బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఈ బాధ్యతను అప్పగించారు. ఈ నియామకం పట్ల శీరం శ్రీను హర్షం వ్యక్తం చేస్తూ, తనకు ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అధినేత శ్రీ రామచంద్రయాదవ్ కి కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్