మంగళవారం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా తన కుటుంబంతో కలిసి అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం ఈఓ చక్రధర్ రావు వారికి స్వాగతం పలికి, వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించారు. ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.