పగో జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన వీఆర్వో కొడమంచిలి సుభాషిణి అనారోగ్యం కారణంగా శనివారం మృతి చెందారు. రావులపాడులో వీఆర్వోగా పనిచేస్తున్నప్పుడు ఆమె అనారోగ్యానికి గురై, కొంతకాలంగా మెడికల్ లీవ్లో ఉన్నారు. చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.