ఆకివీడులో చర్చిలను కూల్చివేయడానికి నోటీసులు జారీ చేస్తున్నారని, దళితులపై అకారణంగా 53 మందిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, 120 మంది వ్యక్తుల జాడ తెలియడం లేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ గెడ్డం హర్షకుమార్ ఆరోపించారు. ఈ ఘటనలన్నీ ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కనుసైగల్లో జరుగుతున్నాయని ఆయన రాజమండ్రిలో గురువారం తెలిపారు. నోటీసులు అందుకున్న వారు తన వద్దకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.