మన బాధ్యత ఫౌండేషన్ రాజమండ్రి సిటీ అధ్యక్షురాలు గారా శ్రీవిద్య రాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ బ్లడ్ డ్రైవ్ బుధవారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. రక్తదానం గురించి అవగాహన కల్పిస్తూ, వేసవిలో రక్త కొరతను తగ్గించవచ్చని ఆమె తెలిపారు. 18 ఏళ్లు నిండి, ఆరోగ్యంగా ఉండి, 50 కిలోల బరువు ఉన్న ఎవరైనా రక్తదానం చేయవచ్చని ఆమె పేర్కొన్నారు.