కష్టాలు, ఇబ్బందుల్లో ఉన్న టీడీపీ కార్యకర్తకు, పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం, తాము అండగా ఉంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాజమండ్రిలోని పలువురు పేద విద్యార్థులకు, వివిధ సమస్యలతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తలకు భవానీ ఛారిటబుల్ ట్రస్టు తరఫున ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందించారు. ఆయా కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.