తూర్పు గోదావరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జేసీ మేఘా స్వరూప్ ఆదివారం తెలిపారు. డీజిల్, పెట్రోల్ కొరతపై 8074661259 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇంధన స్టాక్ సమస్యలు ఎదుర్కొంటున్న డీలర్లు 1967 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారులు సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.