కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మొదటి రోజు సోదాల్లో రూ. 1,82,210 అకౌంట్ లేని సొమ్మును గుర్తించారు. రెండో రోజు డాక్యుమెంట్లు రైటర్ల నుంచి స్టేట్మెంట్లు సేకరించారు. ఇప్పటి వరకు 10 డాక్యుమెంట్లు తక్కువ విలువతో రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల ప్రభుత్వానికి రూ. 2,62,00,154 నష్టం వాటిల్లినట్లు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. ఈ మేరకు విచారణ కొనసాగుతోంది.