రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, విద్యాశాఖ నూతన విధానాలతో నవశకాన్ని నిర్మించుకుంటూ ముందుకు వెళుతుందని తెలిపారు. సోమవారం రాజమండ్రి రూరల్ మండలం సాటిలైట్ సిటీ హై స్కూల్ వద్ద నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. ఈ గదులు విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.