కడియంలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం రాత్రి ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సబ్రిజిస్ట్రార్ (గ్రేడ్-I) ఎప్పిలి లక్ష్మి గదిలోని టేబుల్ డ్రాయర్లో రూ.79,000 నగదు లభించినట్లు ఏసీబీ డీఎస్పీ కిశోర్ కుమార్ తెలిపారు. కార్యాలయంలో మొత్తం రూ.1,82,000 నగదు, సొత్తు దొరికిందని ఆయన వెల్లడించారు. లక్ష్మి గతంలో కాకినాడ, ప్రత్తిపాడు, కాకినాడ చిట్ రిజిస్ట్రార్, అమలాపురంలో పనిచేశారు.