రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం పాత తుంగపాడు గ్రామంలో లబ్ధిదారులైన రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, భూ సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. రైతులకు సాగు భూములపై సర్వహక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్