మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఘన స్వాగతం పలికి, పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.