రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం ఏపీ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హరీష్ కుమార్ గుప్తాను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సీతానగరం, కోరుకొండ పోలీస్ స్టేషన్లు, కోరుకొండ సర్కిల్ కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మించాలని, పోలీస్ స్టేషన్లకు కొత్త వాహనాలను మంజూరు చేయాలని ఆయన డీజీపీని కోరారు. ఈ అభ్యర్థనలపై డీజీపీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.