రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ త్రిమూర్తులు స్వామివారి 79వ కళ్యాణ మహోత్సవాలు త్వరలో జరగనున్నాయి. ఈ మహోత్సవాల ఆహ్వాన శుభలేఖను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం ఆవిష్కరించారు. స్వామివారి కల్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.