సీతానగరం: బాలిక అదృశంపై కేసు నమోదు

సీతానగరం మండలం పురుషోత్తపట్నంకు చెందిన 10 ఏళ్ల మల్లి సాత్విక మంగళవారం అదృశ్యమైనట్లు సీతానగరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై డి. రామ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, మూగ అయిన సాత్విక సోమవారం సాయంత్రం తోటి పిల్లలతో ఆడుకుంటుండగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్