పట్టణ ప్రాంత పేద కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు మెప్మా (MEPMA) ఆధ్వర్యంలో కార్యక్రమాలు వేగవంతం చేశామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ వద్ద 'ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త' బ్రోచర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. పట్టణ పేద కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పిస్తామని, పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ఈ మిషన్ పనిచేస్తుందన్నారు.