ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని రుడా చైర్మన్, రాజనగరం టీడీపీ ఇంచార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. గురువారం మంగళగిరిలో నిర్వహించిన 'స్పందన' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. విభిన్న ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.