రామచంద్రపురంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధే వైసీపీ లక్ష్యమని తెలిపారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని, చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టేందుకే రాజధాని అంశాన్ని వాడుకుంటున్నారని మంగళవారం విమర్శించారు. కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' హామీలను అమలు చేయడంలో విఫలమైందని, అసెంబ్లీలో కొత్త తీర్మానాల అవసరం ఏంటని ప్రశ్నించారు.