రామచంద్రపురం ప్రాంతంలో డీజిల్ కొరత కారణంగా వరి కోతలు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే కీలక సమయంలో డీజిల్ దొరక్క కోత యంత్రాలు ఆగిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాష్ మాట్లాడుతూ, కూలీల కొరత, అధిక ధరలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులకు డీజిల్ సమస్య మరింత భారంగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డీజిల్ సరఫరాను పునరుద్ధరించి రైతులకు అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు.