వివిధ కంపెనీల్లో ఖాళీగా ఉన్న 1000 పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అల్లూరి జిల్లా జీకే వీధి ఎంపీడీవో రమణబాబు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఓ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 7న జీకే వీధిలో ఈ జాబ్ మేళా జరుగుతుందన్నారు. అభ్యర్థుల సామర్థ్యాలను బట్టి ఉద్యోగాల ఎంపిక జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ మేళాను సద్వినిగం చేసుకోవాలని సూచించారు.