ఆగస్టు 8, 9 తేదీల్లో రంపచోడవరంలో జరిగే సిపిఐ రెండవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని చింతూరులో గడపగడపకు ముమ్మర ప్రచారం గురువారం సిపిఐ నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా చింతూరు డివిజన్ కార్యదర్శి గుజ్జా మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. సిపిఐ పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని సమ సమాజ స్థాపన కోసం ప్రజలకు అండదండగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం ముందుండి అనేక పోరాటాలు చేపట్టిందని పేర్కొన్నారు.