అస్పెరేషనల్ బ్లాక్ ఫెలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని రంపచోడవరం ITDA PO స్మరణ్ రాజ్ శనివారం ప్రకటనలో తెలిపారు. మారేడుమిల్లి మండలం పరిధిలో నీతి అయోగ్ పథకంలో పని చేయాల్సి ఉంటుందన్నారు. నెలకు రూ.55 వేల జీతంతో తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకం జరుగుతుందన్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్, డేటా అనలిస్టుగా అనుభవం ఉన్నవారు ఫిబ్రవరి 9లోగా ITDA కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వాలన్నారు.