వీఆర్ పురం మండలం రాజుపేటకాలనీలో ఎమ్మెల్యే శిరీషాదేవి సొంత నిధులతో రోడ్డు నిర్మించారని గ్రామస్థులు మీడియాకు తెలిపారు. వరదల సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఆమెకు వివరించడంతో గ్రావెల్, ఫ్లైయాష్తో రోడ్డు పనులు ప్రారంభించారని చెప్పారు. 20 ఏళ్లుగా రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నామని 600 కుటుంబాలకు ఇది ఉపయోగపడుతుందని టీడీపీ నేత నరేష్ అన్నారు.