రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో సోమవారం, రూ. 60 లక్షల నిధులతో 4 కిలోమీటర్ల ఆర్అండ్బి (R&B) రోడ్డు మరమ్మత్తు పనులకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. ములికిపల్లి సెంటర్ నుండి గోగన్నమఠం వరకు ఈ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, ఎంపీపీ కడలి శ్రీ దుర్గ మోహన్, సర్పంచ్ కుక్కల బేబీ కుమారి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.