తొండంగి మండలం తాటియాకులపాలెంలో శనివారం ఉదయం ఓ వృద్ధురాలు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఆమెను కొట్టి చంపినట్టు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న తొండంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రికి తరలించి విచారణ ప్రారంభించారు.