తుని పాతబజారు వీధిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ప్రభుత్వం గురువారం కొత్త ట్రస్ట్ బోర్డును నియమించింది. కమిటీ చైర్మన్గా కుక్కడపు బాలాజీని నియమించారు. ఆలయ అభివృద్ధి, నిర్వహణ కోసం ఉమ్మిడి వెంకటరమణ, సత్య సుధాకర్, సీతారామరాజు, దర్భా శ్రీనివాస్, శ్రీనివాసంతి, నాగమణి, రమ్య, రమణమ్మ, భాస్కరాచార్యులు సభ్యులుగా ఉన్నారు.