తుని జీఆర్పీ ఎస్ఐ శ్రీనివాసరావు బుధవారం అన్నవరం రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఇటీవల రైళ్లలో సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ ల దొంగతనాలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రయాణికులు తమ సామాను పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.