AP: చదువు అనేది గేమ్ఛేంజర్ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మనం మాత్రమే కాదు.. సమాజం కూడా బాగుండాలనేదే మన సంస్కృతి అని చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం ముందుకు సాగుతుందన్నారు. భారరత్నకు మారుపేరుగా APJ అబ్దుల్ కలాం నిలిచారని పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరులోని జీజీహెచ్లో మాతా–శిశు సంరక్షణ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు రూ.100 కోట్ల విరాళంతో ఈ భవనాన్ని నిర్మించారు.