AP: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 31న భేటీ కానున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ జరిగిన తీరు, అనంతరం జరిగిన పరిణామాలు, ఎన్నికల కౌంటింగ్ విషయాలపై వీరిద్దరూ చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, విదేశీ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు రేపు రాత్రికి అమరావతికి వెళ్లనున్నారు. పవన్ కూడా రేపు రాత్రి లేదా ఎల్లుండి ఉదయం మంగళగిరి చేరుకోనున్నారు.