తణుకు మండలం దువ్వ 3లో గురువారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కిశోర్ ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన వైద్య బృందం వృద్ధులు, పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి, వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమం లో హెచ్ వి దుర్గ కుమారి,డీఈ ఓ సాయిరాం వెంకటేష్,ఎంఎల్ హెచ్ పీ గాయత్రి, ఎంపీ హెచ్ ఏ వెంకట్రాజు,ఏఎన్ఎం రాట్నాలమ్మ, పైలట్ ఆనంద్, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.